అభివృద్ధి డాక్యుమెంటరీ వీక్షించిన: మంత్రి కేటిఆర్
సిరిసిల్ల యదార్థవాది
జిల్లాలో గడిచిన 9 ఎండ్ల లో జరిగిన అభివృద్ధి పై క్షేత్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా ఉందనీ రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు..
శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో
” రాజన్న సిరిసిల్ల
ఏ స్టోరీ అఫ్ డెవలప్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ” అనే శీర్షికతో జిల్లా యంత్రాంగం రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి కే తారకరామారావు ఆవిష్కరించారు.
కాఫీ టేబుల్ బుక్ ను ఆద్యాంతం తిలకించిన మంత్రి జిల్లా సమగ్ర అభివృద్ధినీ తెలిపే చిత్రాలతో అందంగా ఉందన్నారు. బుక్ రూపకల్పనకు ప్రత్యేక చొరవ తీసుకున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ను అభినందించారు..
జిల్లా కలెక్టర్ మార్గదర్శనం లో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి పై ప్రత్యేకంగా రూపొందించి జిల్లా కలెక్టర్ సముదాయంలో నిర్వహించిన దశాబ్ది వేడుకలలో ప్రదర్శించిన 7 నిముషాల నిడివి గల లఘు చిత్రంను మంత్రి కే తారకరామారావు తిలకించారు.. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు,
రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, , రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, అదనపు కలెక్టర్లు బి.సత్య ప్రసాద్, ఎన్.ఖీమ్యా నాయక్, ఆర్డీఓ టి.శ్రీనివాస రావు, మున్సిపల్ చైర్ పర్సన్లు జిందం కళా, రామతీర్థపు మాధవి, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తదితరులు పాల్గొన్నారు.