దొరల రాజకీయాలపై తిరుగుబాటు
ఆర్మూర్ నుంచే మొదలు
– భారీ ర్యాలీలో ఎంపీ అరవింద్
-పైడి రాకేష్ రెడ్డి ర్యాలీతో ఆర్మూరులో బిజెపికి కొత్త ఊపు.
నిజామాబాద్ యదార్థవాది
దొరల పోకడ రాజకీయాలపై తెలంగాణలో తిరుగుబాటు ఆర్మూర్ నుంచి మొదలైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బెదిరింపులు 500 కార్లతో ర్యాలీ తీయడంతో ఎమ్మెల్యే కి భయం పట్టుకుంది అని ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత తనపై మాత్రమే పోటీ చేయాలని గతంలో మాదిరిగా మైసమ్మ ముందు పొట్టేలు కావాలని అన్నారు. ఎమ్మెల్యే ఓటమి 50వేల మెజారిటీతో ఖాయం అని అన్నారు. నిజమాబాద్ జిల్లా డిచపల్లి మండల కేంద్రం నుండి 500 కార్లతో చేపట్టిన ర్యాలీ ఆర్మూర్ పట్టణం మీదుగా పెద్ద ఎత్తున సాగింది. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్, పైడి రాకెష్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పులా మాల వేసి నివాళులర్పించారు. అలాగే రాకెష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ గడ్డకు ఈ జీవితం అంకితం అని అన్నారు. ఎంపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ లో బీజేపీ జెండా ఎగురడం ఖాయం అని.
ఆర్మూర్ లో బీజేపీ గెలిచి మోదీ కి కానుకగా ఇస్తాం అని అన్నారు. బీజేపీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ బెదిరింపులు చేస్తే సహించేది లేదని హెచ్చరిక అనుకోండి విన్నపం అనుకోండి ఇక నుండీ ఒక లెక్క ఇప్పుడు ఓ లెక్క అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లె గంగారెడ్డి, నుతుల శ్రీను, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
