36.9 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్తెలంగాణగౌరవెల్లి మరో అద్భుతం

గౌరవెల్లి మరో అద్భుతం

గౌరవెల్లి మరో అద్భుతం

వొడితల సతీష్ కుమార్

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

హుస్నాబాద్ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఎండిపోయిన చెరువులు కుంటలు దర్శనమిచ్చేవని, కానీ నేను పరిస్థితి ఎందుకు భిన్నంగా మారిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 7 నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవ సంబరాలు పోతారం (ఎస్) శుభం గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. గతంలో బతుకమ్మలు వేయాలన్న, వినాయకుని దుర్గామాతల నిమజ్జనం చేయాలన్న నీళ్లు ఉండేవి కావన్నారు. కానీ నేడు హుస్నాబాద్ నియోజకవర్గంలో చెరువులు కుంటలు జలకళ ఉట్టిపడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ గారు దూర దృష్టితో ఆలోచించి 10 టిఎంసిలకు పెంచడం ద్వారా హుస్నాబాద్ కు జలహారంగా గౌరవెల్లి ప్రాజెక్టు నిలుస్తుందని, గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యిందని త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభించి గోదావరి జలాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని 1’06000 ఎకరాలకు నీరు అందిస్తామని అన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ విధానం అసెంబ్లీలో కేసీఆర్ గారి ప్రసంగం) పుస్తకాన్ని, సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం( తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నివేదిక) పుస్తకాన్ని ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు. హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన సీనియర్ న్యాయవాది రచయిత గులాబీల మల్లారెడ్డి రచించిన ఎద్దు ఏవుసం, సురుకుల వైద్యం అనే పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్