అభివృద్ధిలో అగ్రగామి మన భారత్: రిటైర్డ్ ఆర్మీ గోవిందరాజు
హుస్నాబాద్ యదార్ధవాది ప్రతినిది
ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడేలా మన దేశం ఆదర్శం గా ప్రధాని మోదీ చేస్తున్న సుపరిపాలన, అభివృద్ధిలో అగ్రగామి మన భారత్ అని రిటైర్డ్ ఆర్మీ బిజెపి జాతీయ నాయకులు గోవిందరాజు అన్నారు.. సోమవారం కోహెడ మండల హెడ్ క్వార్టర్స్ లో ఇంటింటి ప్రచారంలో బాగంగా ఆయన మాట్లాడుతూ గ్రామ గ్రామాన బూతుల వారీగా శక్తి కేంద్రం ఇన్చార్జీలను కలిసి ప్రధాని మోడీ చేస్తున్న సేవలను అభివృద్ధిని బిజెపి పాలనలో ప్రపంచవ్యాప్తంగా పొందిన ఔన్నత్యాన్ని ప్రజల ముందుకు ఎలా తీసుకువెళ్లాలని తగు సలహాలు సూచనలు చేస్తూ బూత్ కమిటీ శక్తి కేంద్రాల ఇన్చార్జీలతో కలిసి గ్రామ గ్రామాన పర్యటించి ప్రజలతో మమేకమై బిజెపి చేస్తున్న అభివృద్ధిని వారికి వివరించారు కోహెడ మండలంలోని 27 గ్రామాల్లో 50 పోలింగ్ బూత్ కమిటీలు కార్యవర్గాలతో శక్తి కేంద్రం ఇన్చార్జి లతో జూన్ 28న ప్రారంభమై జూలై మూడో తారీకు వరకు మండల కేంద్రంలోని ఉండి క్షేత్రస్థాయిలో విజయవంతం చేశారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి,
మండల అధ్యక్షుడు ఖమ్మం వేంకటేశం, బిజెపి శ్రేణులు పిల్లి నర్సయ్య గౌడ్ గుగ్గిల శ్రీనివాస్ రజనీకాంత్ రెడ్డి తిరుపతి బండ జగన్ శివ కుమార్ సత్యనారాయణ రెడ్డి వెంకటేశ్వర్లు రామచంద్రారెడ్డి సతీష్ రవీందర్ గౌడ్ సాగర్ గౌడ్ అజయ్ సాయి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు..