ఫోటోగ్రఫీ రంగంలో బహుమతి పొందిన కృష్ణ
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
రంగుల ప్రపంచానికి అందమైన చిత్రాలను అందించే ఫోటోగ్రఫీ రంగంలో అద్భుతమైన కళాకారులను తయారు చేసేందుకు ఎన్నో కాంపిటీషన్ నిర్వహించిన సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో గోవాలో 69వ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను జూలై 2 వ తేదీ నుండి 4వ తేదీ వరకు నిర్వహించినారు.ఫోటోగ్రఫీ వర్క్ షాప్ లో దేశం నుండి నలుమూలల 150 మందికి పైగా ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.వివిధ అంశాల మీద ఫోటోగ్రఫీ చేసి సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి చెందిన దాసరి కృష్ణ కాంస్య పథకాన్ని ప్రశంస పత్రాన్ని సిగ్మా ఆర్ట్ అకాడమీ అధ్యక్షుడు ఎం సి శేఖర్ ముంబై చీఫ్ ఫ్యాకల్టీ సునీల్ మరాటి చేతుల మీదుగా అందుకోవడం చాలా గర్వంగా ఉందని ఇంకా పెద్ద పెద్ద అవార్డులు పొందడానికి కృషి చేస్తానని దాసరి కృష్ణ అన్నారు.ఫోటోగ్రఫీ పై మక్కువతో దాదాపు 25 సంవత్సరాల నుండి వివిధ రకాల ఫోటోలను చిత్రీకరిస్తూ అలాగే కాంపిటీషన్ వర్క్ షాప్ లలో పాల్గొని రకరకాల బహుమతులతో అవార్డులు అందుకున్న దాసరి కృష్ణ ను తోటి ఫోటోగ్రాఫర్లు మరియు గ్రామస్తులు అభినందించారు ఇలాంటివే కాకుండా బంగారు పతకాలను సాధించాలని కొనియాడారు..