మిడ్ మానేర్ పరివాహక గ్రామా ప్రజలు
అప్రమత్తంగా ఉండాలి..
సిరిసిల్ల యదార్థవాది
రాష్టం లో భారీ అతి భారీ వర్షాల వల్ల మిడ్ మానేర్ డ్యామ్ గేట్లు ఎత్తి ఔట్ ఫ్లోలు పెంచే అవకాశం ఉందని బి. జగన్
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పి. సుమతీ దేవి సూపరింటెండింగ్ ఇంజనీర్ పత్రిక ప్రకటనలో తెలిపారు.. ఏ క్షణంలో ఐయిన మిడ్ మానేర్ డ్యామ్ గేట్లు ఎత్తి ఔట్ ఫ్లోలు పెంచే అవకాశం ఉన్నందున రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, మిడ్ మానేర్ పరిసర గ్రామాలలో దండోరా వేయాలని, నదీ పరివాహక ప్రాంతం లోకి రైతులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరులు పశువులను తీసుకుని వెళ్లరాదని, మిడ్ మానేరు జలాశయం దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం ఉండాలని తెలిపారు…