పట్టణంలో పునరావాస కేంద్రం ఏర్పాటు
హుస్నాబాద్ యదార్థవాది
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హుస్నాబాద్ పట్టణంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చైర్ పర్సన్ ఆకుల రజిత తెలిపారు.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల
నేపథ్యంలో గురువారం హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువును మత్తడి, దుకాణదారుల నివాసాలను పట్టణంలోని వార్డులలో శిథిలమైన, కూలిపోయిన ఇండ్లను పరిశీలించారు.. భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని శిథిలమైన ఇండ్లలో నివాసం ఉండకుండా పురపాలక సంఘం హెల్ప్ లైన్ కు వివరాలు తెలుపాలని అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ బాలుర పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐలేని అనిత, కమిషనర్ రాజశేఖర్, ఆకుల వెంకన్న మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు పురపాలక సంఘం సిబ్బందినాయకులు తదితరులు పాల్గొన్నారు..