37.1 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్తెలంగాణకాంగ్రెస్ పార్టీ ఉద్యమాలతోనే రైతులకు రుణమాఫీ ప్రకటన.

కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలతోనే రైతులకు రుణమాఫీ ప్రకటన.

కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలతోనే రైతులకు రుణమాఫీ ప్రకటన.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

రైతు రుణమాఫీ చేయాలంటూ కాంగ్రెస్ చేసిన పోరాటాలు నిరసన కార్యక్రమాల పలితంగా నేడు సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ ప్రకటన చేశారని టీపీసీసీ సభ్యుడు ధర్పల్లి చంద్రం కిసాన్ కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి అన్నారు.. సిద్దిపేటలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన పోరాటాల వల్ల ప్రభుత్వం దిగివచ్చి రైతు రుణమాఫీ చేసిందని హర్షం వ్యక్తం చేస్తూ టీపీసీసీ సభ్యుడు ధర్పల్లి చంద్రం కిసాన్ కాంగ్రెస్ కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని నియంతల వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి గుణపాఠం వచ్చేందుకు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టామని అందులో భాగంగానే చేశారని అన్నారు. రుణమాఫీ చేయడంతో రైతులు కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలకు రైతుల మా వెంటే ఉన్నందుకు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు బాగుపడేలా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టింది రైతులంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నాలుగు సంవత్సరాలుగా రైతులను సీఎం కేసీఆర్ తీవ్ర ఇబ్బందులు పెట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడు మద్దతిస్తుందని వారికోసం తమ పోరాటం ఆగదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి మండల అధ్యక్షులు తప్పెట శంకర్ రాములు బర్మా రామచంద్రన్ మిట్టపల్లి గణేష్ బిక్షపతి ప్రధాన కార్యదర్శి గ్యదరీ మదు, యువజన పట్టణ అధ్యక్షుడు ఖయాజుద్దీన్ బైరి సాయి రాకేష్ ఎండి నవాజ్ నరసవ్వ రజిని అనిల్ తదితరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్