37.1 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్తెలంగాణఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం.!

ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం.!

ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం.!

-మృతి పట్ల కుటుంబ సభ్యుల పిర్యదుతో కేసు నమోదు..

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

హబ్సిపూర్ గ్రామానికి చెందిన బాలవ్వ మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే పది రోజుల క్రితం మృతి చెందిన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామానికి చెందిన బైండ్ల బాలవ్వ(50) మృతి చెందినట్టు తెలిసింది. ఈ విషయమై సర్కిల్ ఇన్స్పెక్టర్ మున్నూరు కృష్ణ మాట్లాడుతూ గత పది రోజుల క్రితం బైండ్ల బాలవ్వ ఇంట్లో మృతి చెందిందని మరుసటి రోజు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించరని. మృతురాలికి ఇద్దరు కుమారులు, కూతుళ్లు ఉన్నారని విరి అందరికీ పెళ్ళిల్లు అయ్యాయని సెప్టెంబర్ 7న ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలవ్వ హఠాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల అంత్యక్రియలు నిర్వహించరని, బాలవ్వ మృతి పట్ల అనుమానం ఉందని, తన తల్లిది సహజ మరణం కాదని మృతి పట్ల అనుమానం కలిగిందని, ఇంట్లో రక్తపు మరకలను గమనించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని, ప్రభుత్వ అనుమతితో దుబ్బాక ఎగ్జిక్యూటివ్ మేజిస్టేట్ జయంత్ ఆదేశాల మేరకు ఖననం చేసిన మృతదేహాన్ని తీసి ఫోరెన్సి వైద్యుల సమక్షంలో అంతక్రియలు చేసిన స్థలంలో పంచనామా నిర్వహించారు. త్వరలో పోస్టుమార్టం రిపోర్టు వివరాలను వెళ్లాడిస్తామని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్