మండల సమీకృత కార్యాలయం ప్రారంభించనున్న : మంత్రి హరీష్ రావు
కొండపాక యదార్థవాది
రాష్ట్ర ముఖ్య మంత్రి స్వంత జిల్లా నియోజక వర్గ కొండపాక మండల అన్నీ శాఖల కార్యాలయాలు ఒకే దగ్గర ఉండాలనీ సుమారు 7.82 కోట్ల వ్యయంతో అన్నీ వసతులతో నిర్మించిన సమీకృత కార్యాలయ భవన సముదాయాల ప్రారంబానికి మంగళవారం వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నరని స్థానిక కొండపాక ఎంపీపీ సుగుణ దుర్గయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హరీష్ రావు, ఆధితులుగా జెడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాపరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారని వారు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిటిసిలు గురజాడ బాలాజీ, పత్తి ఆంజనేయులు, ఖమ్మంపల్లి యాదగిరి, ఏ ఈ తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..