బిజెపి నుండి బీఆర్ఎస్ లో చేరిన జిల్లా నాయకులు.
సిద్దిపేట యదార్థవాది జిల్లా ప్రతినిది
సిద్దిపేట బీజేపీ జిల్లా నాయకులు కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుదవారం శివనుభవణంలో జిల్లా అధికార ప్రతినిది కొండూరి మహేష్ బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సాయి వెంకట్ తదితరులు చేరారు సందర్భంగా హరీష్ మాట్లాడుతూ బీఆర్ ఎస్ పార్టీ అన్ని వర్గాల అభ్యున్నతి కి కృషి చేస్తుందని వైష్యులకు సమూచిత స్థానం కల్పించిన పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ అండదండలతో సిద్దిపేట అభివృద్ధిలో ముందున్నామని నేడు కెసిఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం తధ్యమని బిజెపి కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో ఓట్లడుగుతుందని వస్తున్నాయని ఆపార్టీలకు ఈనెల 30న ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. టిఆర్ఎస్ లో చేరిన నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల అభ్యున్నతి కి కృషి చేస్తుందని వైష్యులకు సమూచిత స్థానం కల్పించిన పార్టీ ప్రభుత్వం బీఅర్ఎస్ అని మంత్రి హరీష్ రావు కృషి తో సిద్దిపేట అభివృద్ధి జరిగిందని హరీష్ రావు లాంటి నాయకులు సిద్దిపేట లో ఉండటం ప్రజల అదృష్టమని తెలిపారు. కొండూరి సతీష్ అజిజ్ రాజు కె అరవింద్ రమేష్ రాజేష్ సంతోష్ కాసన గొట్టు శ్రావణ్ కుమార్ సంతోష్ చెన్నోజు నరేందర్ సాయి ప్రదీప్ అజయ్ నందు గోపి తదితరులు పార్టీలో చేరారు.