సంగారెడ్డి లో ఓటు హక్కు వినియోగించుకున్న: చింత ప్రభాకర్
సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది
అందరితో పాటు క్యూలో నిలబడి ఓటు వేసిన సంగరెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింత ప్రభాకర్. సదాశివపేటలోని రవీంద్ర మోడల్ ప్రాథమిక పాఠశాలలో 187 పొలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు రాజ్యాంగం కల్పించిన పవిత్రమైన మన హక్కు, ఓటు అనేది ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నీతివంతమైన పాలను ఎన్నుకోవడానికి ఉపయోగ పడుతుందని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు మనందరి హక్కు సద్వినియోగం చేసుకుందాంఅని అన్నారు.