27 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్తెలంగాణప్రజల ఆకాంక్ష మేరకే అధికారులు కృషి చేయాలి: జడ్పీ చైర్ పర్సన్

ప్రజల ఆకాంక్ష మేరకే అధికారులు కృషి చేయాలి: జడ్పీ చైర్ పర్సన్

ప్రజల ఆకాంక్ష మేరకే అధికారులు కృషి చేయాలి: జడ్పీ చైర్ పర్సన్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం  మంగళవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శాసనమండలి సభ్యులు వంటేరు యాదవరెడ్డి దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి జెడ్పిటిసిలు ఎంపీపీలు జడ్పీ కో ఆప్షన్ సభ్యులు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం హార్టికల్చర్ పశుసంవర్ధక శాఖ విద్యా వైద్య ఆరోగ్యo ఆయుష్ ఎన్ఆర్ఈజీఎస్ బీసీ సంక్షేమం ఎస్సీ కార్పొరేషన్ ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్ అండ్ బి నేషనల్ హైవే విద్యుత్ స్త్రీ శిశు దివ్యంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సివిల్ సప్లై శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతిని జిల్లా అధికారులు సభకు వివరించగా ఆయా మండలాల్లో జరుగుతున్న పనుల జాప్యం కొత్త పనుల అవసరాలను సంబంధిత జడ్పిటిసిలు ఎంపిటిసిలు సభా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు అధికారులు నడుచుకొని జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లాలో చేపట్టిన వివిధ నిర్మాణ పనులు పథకాలను కొనసాగించాలని  కమిటీ సభ్యుల కోరిక మేరకు తీర్మానం చేసినట్టు ఆమె తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్