ఈటెల సమక్షంలో బిజెపిలో చేరిన ఎల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్
యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి
ఎల్లారెడ్డి సెగ్మెంట్ కామారెడ్డి మండలం కేంద్రంలో జరిగిన బిజెపి స్ట్రీట్ కార్నర్ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హుజురాబాద్ శాసన సభ్యులు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి సమక్షంలో గురువారం ఎల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంతి గౌడ్ బిజెపిలో చేరారు. ప్రశాంత్ గౌడ్ ప్రస్తుత ఎమ్మెల్యే సురేందర్ అనుచరుడిగా గతంలో పార్టీలో ఉండి వైస్ చైర్మన్ అయ్యారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యేతో విభేదాలతో, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కి దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే బిజెపిలోనే కొనసాగాలని నిర్ణయించుకొని ఈటెల సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన ప్రశాంత్ గౌడ్ కు పార్టీ కండువా కప్పి ఈటెల పార్టీలోకి స్వాగతించారు. ఆయనతో పాటు తన వర్గీయులు కూడా అందరు బిజెపిలో చేరారు ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో బిజెపి పార్టి బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.