ఉపాధి హామీ కూలీల పట్ల అధికారుల
నిర్లక్ష్యం
-ఇందల్వాయి ఎంపీడీవో కార్యాలయం ముట్టడించిన ఉపాధి హామీ కూలీలు
-ఉపాధి హామీ పనులలో కార్యాలయం అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనబడుతుంది
నిజమాబాద్ యదార్థవాది
ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామం ఉపాధి హామీ కూలీల పట్ల అధికారుల
నిర్లక్ష్యంతో రోజు 20 మంది కూలీలు పనిచేస్తుంటే 30 మంది కూలీలకు డబ్బులు ఖాతాలో జమవుతున్నట్లు తెలుసుకొని ఎంపీడీవో కార్యాలయన్ని ముట్టడించిన కూలీలు…
చేసిన వారికి తక్కువ డబ్బులు రావడంతో కూలీలు వారి యొక్క ఆరోపణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నవని మంగళవారం ఎంపీడీవో ఆఫీస్ ని ముట్టడించారు. కూలి పని చేయని వారికి ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని కూలీలు తెలిపారు. 20 రోజుల పనికి నాలుగు రోజుల డబ్బులు పడుతున్నాయని తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడినుండి వెళ్ళదే లేదని వారు ఆందోళన చేశారు..ఎంపీడీవో రాములు నాయక్ సెలవు వుండటంతో ఎంపీఓ పోశెట్టి మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు ఎవరు కూడ ఆందోళన పడవదని ఇట్టి విషయంలో సమగ్రంగా విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు…ఈ విషయం పై గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ లు మాట్లాడుతూ ఉపాధి హామీల కష్టాలు ఎంపీడీవో ఆఫీస్ వచ్చేంతవరకు తన దృష్టికి రాలేదని ఫీల్డ్ అసిస్టెంట్ రాము అనారోగ్యంతో ఉండడంతో సమస్యలు వచ్చాయని ఇక నుండి ప్రజాప్రతినిధులుగా మా బాధ్యతను మేము సర్దుబాటు చేసుకుని ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేస్తామని, ఇప్పటి నుండి ఉపాధి హామీ కూలీలను గ్రూపులుగా తయారు చేసి సమస్యల్ని రాకుండా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఅర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ నాయకులు కూలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..