ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన: ఎమ్మెల్యే సతీష్
అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం.
ప్రజల ప్రేమ, ఆప్యాయత, అభిమానాలకు కృతజ్ఞతలు తెలిపిన సతీష్ కుమార్.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
నియోజవర్గంలోని అక్కన్నపేట మండలం మంచినీళ్లబండ, దాని అనుబంధ గ్రామం యాటకర్లపల్లె, టేకులతండా, గొల్లపల్లి, మల్లంపల్లి, మోత్కులపల్లి, పెద్దతండ, చౌటపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సతీష్ కుమార్.. హుస్నాబాద్ నియోజక వర్గాన్ని వేలకోట్లతో అభివృద్ధి చేశానని ప్రతి గ్రామంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని, ఈ అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి అని కోరారు. ప్రజలు మహిళలు యువత అడుగడుగునా సతీష్ కుమార్ కు గురువారం ఘన స్వాగతం పలికారు కోలాటాలతో డప్పుచప్పులతో మీ వెంటే మేమంతా అని జై తెలంగాణ, జై బీఆర్ఎస్, కెసిఆర్, జై సతీష్ కుమార్ అని నినదించారు..