29.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
హోమ్తెలంగాణకంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రథమ స్థానంలో నిలుపుదాం..

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రథమ స్థానంలో నిలుపుదాం..

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రథమ స్థానంలో నిలుపుదాం..

సిద్దిపేట:16 యదార్ధవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లాలో కంటి వెలుగు ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. గజ్వేల్ నియోజకవర్గం అన్ని మండలాలలో కంటి వెలుగు ఏర్పాట్లను సోమవారం అధికారులతో పరిశీలించారు. సెంటర్ పనిచేసే అప్తామెట్రిక్ డాక్టర్, డాటా ఎంట్రి ఆపరేటర్, సుపర్ వైజర్, ఎఎన్ ఎమ్, ఆశా సిబ్బందితో మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చెయడంలో ప్రజాప్రతినిధులు, భాగస్వామ్యం కావాలన్నారు. ఇంత గోప్ప కార్యక్రమం ప్రజలకు వివరించలని, ప్రతి సెంటర్ రప్పించెలా చర్యలు తీసుకోవాలని, సిబ్బంది రోజు 8:30వరకు సెంటర్ కి చేరుకోవాలి. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం గా పూర్తి చేసి సిద్దిపేట జిల్లాను ప్రథమ స్థానంలో నిలపలాని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. కలెక్టర్ వెంట డిఎంఎచ్ ఒ కాశీనాథ్, గజ్వేల్ డివిజన్ డిప్యూటీ డిఎంఎచ్ ఓ విజయరాణి, ఎంపిడిఒ లు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్