కార్తీక మాసం మొదటి రోజు నదీతీరాలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచి మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు . నదీతీరాల వద్ద పూజలు చేసి దీపాలను నదుల్లో వదులుతారు. శ్రీశైలంలో నేటి నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాస ఉత్సవాలు నిర్వహించబోతున్నారు . గంగాధర మండపం వద్ద భక్తులు కార్తీక దీపారాధనలు చేస్తున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు.