కొత్త బస్సులను ప్రారంభించిన: మంత్రి పొన్నం
హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు కొత్తగా వచ్చిన 80 బస్సులు (30 ఎక్స్ప్రెస్. 30 రాజధాని ఏసీ 20 లహరి స్లీపర్ సీటర్లు) లను శనివారం రవాణా బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
హైదరాబాద్ లోని డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో 80 కొత్త ఆర్టీసీ బస్సులను మంత్రి పొన్నం సంస్థ ఎండీ సజ్జనార్ అధికారులతో కలిసి ప్రారంభించారు.
త్వరలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నన్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. వీటిలో రాజదాని హైదరాబాద్ కు 500 జిల్లాలకు 500 బస్సులు కేటాయించనున్నట్లు వివరించారు.