క్రీడాకారుని కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం
హుస్నాబాద్ యదార్థవాది
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన క్రీడాకారుడు శనిగరం అంజనేయులు గత ఏప్రిల్ నెల 7వ తేదీ నా హుస్నాబాద్ లో కర్ణకంటి మంజుల రెడ్డి టోర్నమెంట్ లో క్రికెట్ అడుతు అకస్మాత్తుగా మృతి చెందిన సందర్భంగా సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి ఆంజనేయులు కుటుంబానికి అండగా ఉంటానని గతంలోనే తెలిపినా విషయం తెలిసిందే.. కాగా శనివారం హుస్నాబాద్ నియోజకవర్గ సామాజిక సేవకురాలు మంజులరెడ్డి సహృదయంతో బాధిత కుటుంబానికి తన సొంత ఖాతా నుండి రెండు లక్షల రూపాయలు చెక్కును అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో తక్షణమే స్పందించి వైద్య సహాయానికి హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించినప్పటికీ శనిగరం ఆంజనేయులు చనిపోయారు. తదానంతరం మంజులక్క యువసేన సభ్యులు దహన సంస్కారాలకు 50 వేల రూపాయలు ఇచ్చి దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించారు. 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నందుకు సుందరగిరి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.. కార్యక్రమంలో సర్పంచ్ మూర్తి రమేష్ ఉప సర్పంచ్ జంగా శ్రీనివాస్ రెడ్డి మంజులక్క యువసేన మండల అధ్యక్షులు మంద శ్రీనివాస్ కంది తిరుపతిరెడ్డి దిలీప్ శంకర్ తాళ్ల పెళ్లి సంపత్ గౌడ్ పెసర శ్రీనివాస్ కొమురయ్య యువసేన సభ్యులు రవీందర్ రెడ్డి, అవినాష్ గౌడ్,సురేష్ గౌడ్, ప్రవీణ్, వంశీ,శ్రావణ్ రెడ్డి, అజయ్, రాజ శేఖర్, కళ్యాణ్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు..