గంజాయి పట్టుకున్న పోలీసులు..
1.25 కిలోల గంజాయి పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..
యదార్థవాది ప్రతినిది మంచిర్యాల
మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి లో గంజాయి ఇతర ప్రాంతం ల నుండి తీసుకు వస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్, సబ్ ఇన్స్పెక్టర్ లచ్చన్న సిబ్బంది తో కలిసి మందమర్రి లోని టోల్ ప్లాజా వద్ద అనుమానస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు మంచిర్యాల, రెడ్డి కాలనీలో ఒక ఇంటిలో నిల్వచెసిన 1.25 కిలోల గంజాయి దొరకడం జరిగిందని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొన్నమని, అందులో ఒకరు మైనరు అని పోలీసులు తెలిపారు..