38.2 C
Hyderabad
Tuesday, April 14, 2026
హోమ్తెలంగాణగాంధీ మహాత్మునికి ఘన నివాళి

గాంధీ మహాత్మునికి ఘన నివాళి

గాంధీజీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

భారత స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరిస్తూ గాంధీ వర్ధంతి సందర్భంగా కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత గాంధీజీ ఫోటోకు పూలమాలవేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేటి మన స్వాతంత్రం మన స్వేచ్ఛ ఆనాటి వీరుల అసమాన త్యాగఫలం, ఆ మహానుభావుల మహా ప్రసాదం, దేశ స్వాతంత్య్ర కొరకు త్యాగాలు చేసిన అమర వీరులకు మనం ఎల్లవేళలా స్మరిస్తూ వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ శ్రమించడమూ, సేవా దృక్పథమూ, ఆధ్యాత్మిక దృక్కోణమూ మన జీవితంలో ప్రధానాంశాలు అంశాలుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ కుమార్, సిసిఎస్ సిఐ సంజయ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ధరణి కుమార్, సూపరిండెంట్లు ఎస్.కె జమీల్ పాషా, ఫియాజుద్దీన్ మరియు కార్యాలయ సిబ్బంది అధికారులు కలసి పుష్పాలు వేసి నివాళులర్పించి భారత స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల అమరవీరులు త్యాగాలను స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో 2 నిమిషాలు మౌనం పాటించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్