30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణగులాబీ మాయమైన ఆర్మూర్.

గులాబీ మాయమైన ఆర్మూర్.

గులాబీ మాయమైన ఆర్మూర్.

-క్రిక్కిరిసిన సభాస్థలి. రోడ్లపైనే వేలాది మంది జనం..

-ఆర్మూర్ లో జనాన్ని చూసి కేసీఆర్ సంతోషం..

-ప్రజాఆశీర్వాద సభ విజయం తో గులాబీ శ్రేణుల్లో నయా జోష్..

ఆర్మూర్ యదార్థవాది ప్రతినిది

నిజామాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జరిగిన ఆర్మూర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పెద్ద ఎత్తున విజయవంతం అయింది. ఆర్మూర్ నియోజకవర్గాన్ని ముంచెత్తిన జన సంద్రాన్ని చూసి ఇది జనమా..గులాబీ వనమా అన్న భావన కలిగింది. మహిళలు, యువకులు, రైతులతో క్రిక్కిరిసిన సభాస్థలికి
చేరుకోలేక రోడ్లపైనే నిలిచిన వేలాది మంది ప్రజలు “జై కేసీఆర్, జై జీవనన్న,జై తెలంగాణ” అని నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు చాల ఇబ్బంది పడ్డారు. సభకు మహిళలు, యువకులు అధిక సంఖ్యలో రావడం విశేషం. సభకు సీఎం కేసీఆర్ నిర్ణీత సమయం కన్నా రెండు గంటలు ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రజలు సభాస్థలిలోనే ఉండి వేదికపైన ఉన్న పార్టీ నేతలతో కలిసి నృత్యాలు చేశారు. జై జీవనన్న నినాదాలతో సభాస్థలి మారు మోగింది. ముఖ్యమంత్రి సభా వేదిక పైకి రాగానే ప్రజలకు అభివాదం చేసి అనంతరం ప్రసంగిస్తూ
ఆర్మూర్ లో జనం, జనం ప్రభంజనం అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ జన సంద్రాన్ని చూసి జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని కేసీఆర్ అన్నారు. ఇదిలా వుండగా ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ తో గులాబీ శ్రేణుల్లో నయా జోష్ కనిపించింది. ప్రజా ఆశీర్వాద సభకు ఊహించినదాని కన్నా రెట్టింపు వచ్చి విజయవంతం చేసిన ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్