గ్రామంలో బీఆరెస్ రోడ్ షో
కుకునూర్ పల్లి యదార్థవాది
గజ్వేల్ బీఆరెస్ పార్టీ అభ్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా గురువారం లకుడారం గ్రామం లో రాష్ట్ర ఎంపిటిసిల పోరం అద్యక్షులు దేవి రవీందర్ స్థానిక సర్పంచ్ కందూరి కనకవ్వ ఐలయ్యా అద్వర్యం లో తొమ్మిది ఏళ్ళ నుండి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులగురించి వివరిస్తూ ఈ ఎన్నికల్లో భాగంగా బీఆరెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ని తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటు వెయ్యాలని కోరారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చెప్పే మోసపూరిత అమలుకు అనువుగాని మాటలు నమ్మొద్దని కేసీఆర్ కు ఓటు వేసి మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తేనే తెలంగాణ మరింత అభివృద్ధి లో ముందుకు పోతుందన్నారు. కార్యక్రమంలో ప్రదీప్ యాదవ్ పత్తిరి రాము కంకణాల మల్లేశం రజక సంఘం మండల అధ్యక్షులు, రాచకొండ మైపాల్,మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.