24.2 C
Hyderabad
Thursday, May 29, 2025
హోమ్తెలంగాణగ్రూప్ 2 పరీక్షలకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు

గ్రూప్ 2 పరీక్షలకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు

గ్రూప్ 2 పరీక్షలకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు

-జిల్లా అదనపు ఎస్పి నాగేశ్వరరావు

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 13: గ్రూప్-2 రాత  పరీక్షకు జిల్లా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా అదనపు ఎస్పి నాగేశ్వరరావు అన్నారు. ఈ నేల 15, 16 న జరిగే గ్రూప్-2 రాత  పరీక్షకు సూర్యాపేట పట్టణంలో 30, కోదాడ పట్టణంలో 19, పరీక్ష కేంద్రాలు ఉన్నాయని ఈ కేంద్రాల వద్ద  163 బి.ఎన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసి వేయాలని, పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుంపులుగా చెరవద్దని ఆయన అన్నారు. గ్రూప్-2 రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ లో పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని, అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్ లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లడానికి అనుమతి లేదని, పరీక్ష కేంద్రంలోకి వెళ్లేముందే ప్రధాన గేట్ వద్ద  తనిఖీలు నిర్వహించే పోలీసులకు సహకరించగలరని, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాలకు సమయానికి రావాలని, ఇబ్బంది పడకుండా ముందురోజే పరీక్షా కేంద్రాల పూర్తి అడ్రస్ ను పరిశీలించుకోవాలి.. సమయపాలన పాటించి ఎలాంటి వత్తిడి లేకుండా పరీక్ష వ్రాయాలని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్