24.2 C
Hyderabad
Wednesday, February 25, 2026
హోమ్తెలంగాణజన హితమే-మా అభిమతం

జన హితమే-మా అభిమతం

జన హితమే-మా అభిమతం

బెజ్జంకి యదార్థవాది

బెజ్జంకి మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లు పాక్షికంగా ఇళ్లలోకి వర్షపు నీరు రాకుండా లింగాల లక్ష్మణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు లింగాల వెంకటేష్ అధ్వర్యంలో గురువారం పరదాలు అందచేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల దృష్ట్యా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గ్రామంలోని రోడ్లు, జలమయమయ్యే అస్కరంవుందని, పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిని ఉన్నాయని, వారికి రక్షణగా తమ వంతుగా పరదాలు పంపిణీ చేయటం జరిగిందని, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించటం జరిగిందని, భారీ వర్షాల దృష్ట్యా పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సభ్యులు బోనగిరి శ్రీనివాస్, లింగాల శ్రీనివాస్, రామంచ పర్షరాములు,బోనగిరి మధు, జంగిటి శంకర్,లింగాల శ్రీకాంత్,లింగాల రాజు, లింగాల దిలీప్, లింగాల జితేందర్,బోనగిరి అజయ్,పండుగ మధు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్