25.8 C
Hyderabad
Saturday, August 2, 2025
హోమ్తెలంగాణజనాలకి రోగాలు ప్రబలకుండా చూస్తున్నాం..

జనాలకి రోగాలు ప్రబలకుండా చూస్తున్నాం..

జనాలకి రోగాలు ప్రబలకుండా చూస్తున్నాం..

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పోచమ్మ వాడలో సుమారు 82 ఊర పందులను పురపాలక సిబ్బంది జనావాసాల నుండి దూరంగా తరలించారు. ప్రభుత్వ ఆదేశం మేరకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో సంచరిస్తున్న ఊర పందులను జనావాసాలకు దూరంగా తరలించడం జరుగుతుందని హుస్నాబాద్ పురపాలక శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. జనావాసాల మధ్య పందుల సంచారం ద్వారా హెచ్1ఎన్1 లాంటి వివిధ రకాల వైరస్ లు, డెంగ్యూ, మలేరియా లాంటి వైద్యులు ప్రబలి ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందన్నారు. పురపాలక సంఘ కౌన్సిల్ తీర్మానం మేరకు ఊర పందులను జనావాసాలకు దూరంగా తరలిస్తున్నట్లు వెల్లడించారు ఇందులో వాడు కౌన్సిలర్ బోజు రమ రవీందర్,జవాన్ సారయ్య ప్రభాకర్, కానిస్టేబుళ్లు రాజు,రమేష్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్