జమున అభినయనం ప్రజల గుండెల్లో చెదరని ముద్ర ప్రముఖ చిత్రకారులు రుస్తుం
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
సినీ జగత్తులో అలనాటి మేటి హీరోయిన్ జమున మరణం సినిమా ప్రపంచంలో తీరనిలోటు. పుట్టిల్లు, గుండమ్మకథ మొదలు రెండువందల చిత్రాల్లో నటించి సత్యభామగా మరపురాని పాత్రలతో తెలుగు ప్రజల గుండెల్లో అభినయనం తో చెదరని ముద్రలు వేసి స్థిరస్థాయిగా నిలిచిన తార జమున.
ఆమె ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె చిత్రాన్ని చిత్రించి నివాళి అర్పించారు. ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం, ఆర్ ఏ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీం రుస్తుం తదితరులు పాల్గొన్నారు .