జమున మృతిపట్ల ప్రముఖుల సంతాపం
యదార్థవాది ప్రతినిది హైదరాబాద్
సీనియర్ నటి జమున మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. సత్య భామగా అందరి హృదయాల్లో పదిలమైన సీనియర్ నటీమణి, రాజకీయ నాయకురాలు శ్రీమతి జమున(86) మృతి పట్ల రాష్ట్ర మంత్రులు, రాజకీయ, సిని పరిశ్రమ సంతాపం తెలియజేశారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించి, తనదైన ముద్ర వేసుకుని, సినీ అభిమానులను మెప్పించిన నటిగా ఆమె తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిచారని, 1980లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా పనిచేసి విలక్షణమైన వ్యక్తిగా, రాజకీయ నేతగా ప్రజాభిమానం పొందారని, సీనియర్ నటులు వరుసగా చనిపోతుండడం సినీ పరిశ్రమకు తీరని లోటుగా అభివర్ణించిన వ్యక్తిఅని, స్వర్గీయ జమున కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థించారు..