ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహాo ఏర్పాటు చేయాలి.
యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో తెలంగాణ తొలిదశ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య 96 వ జయంతి వేడుకలను కురుమ కులస్తులు ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ ఉద్యమంలో దొరల పై పోరాటం చేసి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చాలా రోజులుగా తాము డిమాండ్ చేస్తున్న ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడమనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. దొడ్డి కొమురయ్య చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చి భావితరాలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం మండల్ నాయకులు సూర్ ఐలయ్య, గడ్డం కొమరయ్య, దొడ్డి శ్రీనివాస్, కోహెడ కొమరయ్య, మేకల రమేష్, బిజెపి నాయకులు బొమ్మగాని సతీష్, ఓదయ్య తదితరులు పాల్గొన్నారు