తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలిపిన మహనీయుడు రామారావు:
విశాఖపట్నం: యదార్థవాది ప్రతినిది
తెలుగు జాతిని ప్రపంచం గౌరించేలచేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఖ్యాతి స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కే దక్కుతుందని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. విశాఖపట్నం గాజువాక పశ్చిమ నియోజకవర్గం లో రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ తరతరాలుగా ప్రతి మనిషి గుండెల్లో కొలువై ఎంతో పేరుగడించారని, పేదవాడికి తినడానికి తిండి రెండే రూపాయలకు కేజీ బియ్యం ప్రవేశపెట్టిన వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు. సినీ రంగంలో ఎన్నో కళ్ళలను పోషిస్తూ పోషిస్తూ కళా పోషకుడిగా నటసార్వభౌముడుగా నటనతో ప్రజలను మెప్పిస్తూ అటు రాజకీయంగా ఇటు సినీ రంగంలో తనదైన శైలిని చూపిస్తూ ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి ఎన్టీ రామారావు అని చెప్పారు.