29.5 C
Hyderabad
Wednesday, September 17, 2025
హోమ్తెలంగాణదశాబ్ది ఉత్సవాలను పెద్ద పండగల నిర్వహించాలి..

దశాబ్ది ఉత్సవాలను పెద్ద పండగల నిర్వహించాలి..

దశాబ్ది ఉత్సవాలను పెద్ద పండగల నిర్వహించాలి..

– 2 నుంచి 22 వరకు జరిగే దశాబ్ది ఉత్సవాలను ప్రజలు ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలి.

దౌల్తాబాద్ యదార్థవాది

దశాబ్ది ఉత్సవాలను అన్ని గ్రామాల్లో
ఈ నెల 2 నుంచి 22 వరకు ప్రజలంతా పండగ వాతావరణంలో నిర్వహించాలని ఎంపీపీ గంగాధరి సంధ్య అన్నారు.. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాజేష్ కుమార్ అధ్యక్షతన దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ 33 జిల్లాలుగా చేసి ప్రజల ముంగిట్లో పరిపాలన సౌలభ్యం చేశారని, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు అందుతున్నాయని, దేశం చూపు తెలంగాణ వైపే ఉందని అన్నారు. దశాబ్ది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేసి దశాబ్ది ఉత్సవాలను గ్రామాల్లో పండుగ వాతావరణం లో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా జడ్పీ కో ఆప్షన్ సభ్యులు రహిమొద్దిన్, ఐకెపి ఎపిఎం కిషన్, ఎం పి ఓ సయ్యద్ గఫూర్, వైస్ ఎంపీపీ అల్లిశేఖర రెడ్డి, మండలంలోని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్