దేశ సేవలో యువత ముందుండాలి
సిరికొండ యదార్థవాది ప్రతినిది
దేశంకోసం తమ వంతు సేవ చేసే లక్ష్యంతో యువత ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని దేశ సేవలో యువత ముందుండాలని సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీచైర్మన్ రావుట్ల నర్సయ్య అన్నారు. ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ ఫలితాలలో సత్యశోధక్ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు గడ్డల నిహాల్, దేశెట్టి అరుణ్ కుమార్ లను ఆయన గురువారం సత్కరించారు వారు ఇండియన్ ఆర్మీ జనరల్ డ్యూటీ విభాగంలో ఎంపికైనట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగారెడ్డి శంకర్రవి సతీష్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.