21.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణధాన్యగారంగా తెలంగాణ

ధాన్యగారంగా తెలంగాణ

ధాన్యగారంగా తెలంగాణ

సిద్ధిపేట యదార్థవాది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యగారంగా తెలంగాణ మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం సిద్ధిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో నూతన పోచమ్మ దేవాలయ విగ్రహా ప్రతిష్ఠ ఉత్సవం, బోడ్రాయి పండుగలో ఆయన పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాన్ని అనేక రకాలుగా అన్నీ రంగాలలో అభివృద్ధి చేసుకున్నామని, గ్రామానికి డబుల్ లేన్ రోడ్డు-బైపాస్ రోడ్డు రావడంతో సరికొత్త అందమొచ్చిందని, వారం రోజుల్లో రూ.2 కోట్ల వ్యయంతో గ్రామ ఎస్సీ కాలనీ నుంచి రామంచ వెళ్లే రహదారికి పనులు ప్రారంభం చేసుకుందామని అయన అన్నారు. అనంతరం గ్రామ నాభి శిల బొడ్రాయి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవానికి మంత్రి హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేశ్ గౌడ్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏంపీపీ శ్రీదేవి, జెడ్పీటీసీ శ్రీహరి గౌడ్, ఎంపిటిసి లతా, పిఎసిఎస్ డైరెక్టర్ ఒగ్గు మురళి ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్