26.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
హోమ్తెలంగాణనిరాశ్రయురాలిని సఖి కేంద్రం తరలింపు

నిరాశ్రయురాలిని సఖి కేంద్రం తరలింపు

నిరాశ్రయురాలిని సఖి కేంద్రం తరలింపు

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

వీధుల్లో నిరాశ్రయురాలిగా జీవిస్తున్న మహిళలను గుర్తించి వృద్ధుల సంరక్షణ కేంద్రానికి తరలించిన జిల్లా సంక్షేమ అధికారి.. శనివారం విధి నిర్వహణకు వస్తున్న సందర్భంలో బాలల పరిరక్షణ విభాగంలో పనిచేస్తున్న న్యాయ సేవల అధికారికి ఒక నిరాశ్రయులైన మహిళ కనిపించగా ఆమె వెంటనే జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన జిల్లా సంక్షేమ అధికారి సఖి కేంద్రం నిర్వాహకురాలు బోనాల రోజా సమాచారం ఇచ్చి వెంటనే సదరు మహిళలను ఎల్లారెడ్డిపేటలోని వృద్ధుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. వృద్ధురాలి వివరాలు తెలుసుకొని పిల్లల చెంతకు చేర్చాలని ఒకవేళ సంబంధించిన ఎవరూ లేనట్లయితే ఆమెను వృద్ధుల సంరక్షణ కేంద్రంలో తగు జాగ్రత్తలతో సంరక్షించడానికి కేంద్రం నిర్వాహకులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్