నేతాజీ 126 వ జన్మదిన వేడుకలు
సిద్ధిపేట: యదార్థవాది ప్రతినిది
సిద్ధిపేట జిల్లా పట్టణంలో స్థానిక నేతాజీ పబ్లిక్ స్కూల్ లో నేతాజీ జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధనోపాధ్యాయులు సుభాష్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి మాట్లాడుతూ నేతాజీ కణకణ మండే నిప్పుకణం.. భారతజాతి వేకువ కిరణం.. స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన సూర్యుడు… జయంతే కాని వర్ధంతి లేని అమరుడు..!! ఆజాద్ హింద్ పౌజ్ ను స్థాపించి తెల్లవారి గుండెల్లో నిద్రించిన వీరుడు.. అణువణువునా దేశభక్తిని నింపుకున్న శూరుడు.. జైహింద్ అంటూ నినదించిన ధీరుడు.. స్వాతంత్య్ర సాధనే తన జీవిత ధ్యేయంగా తపించిన భరతమాత ముద్దు బిడ్డ, ఆజాద్ హింద్ ఫౌజ్ జీవగడ్డ,*నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి జరుపుకోవడం వారిని మనం ఆదర్శంగా తీసుకోవడం దేశ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్య ప్రదర్శన నిర్వహించారు విద్యార్థులు, పేరెంట్స్ నీఎంతగానో అలరించింది నేతాజీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పద్మ, జ్యోతి, లావణ్య, ప్రత్యు శా నరేష్ తదితరులు పాల్గొన్నారు.
