22.7 C
Hyderabad
Wednesday, July 2, 2025
హోమ్తెలంగాణపటిష్టమైన బందోబస్తు

పటిష్టమైన బందోబస్తు

పటిష్టమైన బందోబస్తు

యదార్థవాది ప్రతినిధి కొమురవెల్లి

కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల కు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు సందర్భంగా అడిషనల్ డిసిపి అడ్మిన్ ఎస్. మహేందర్ పార్కింగ్ ప్రదేశాలను, శీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, సాధారణ దర్శన ప్రదేశాలను, టెంపుల్ ఆవరణను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి, కమ్యూనికేషన్స్ సెట్ ద్వారా బందోబస్తు పర్యవేక్షణ చేస్తూ సిబ్బందికి తగు సూచనలు సలహాలు తెలిపి మాట్లాడుతూ మూడవ ఆదివారం సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం ఆదేశానుసారం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, సీసీ కెమెరాల ద్వారా కొమరవెల్లి పోలీస్ స్టేషన్ లో నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని సూచించారు. దర్శనానికి వచ్చే భక్తులు పోలీసు వారి సలహాలు సూచనలు పాటిస్తూ మల్లికార్జున స్వామిని ప్రశాంతంగా దర్శించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, హుస్నాబాద్ ఏసిపి సతీష్, హుస్నాబాద్ సీఐ కిరణ్, కోమురవెల్లి ఎస్ఐ చంద్రమోహన్, మరియు పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్