29.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణపట్టణ, గ్రామాల్లో వెల్లడించేది తుది జాబితా కాదు

పట్టణ, గ్రామాల్లో వెల్లడించేది తుది జాబితా కాదు

పట్టణ, గ్రామాల్లో వెల్లడించేది తుది జాబితా కాదు

-అర్హత ఉండి పేరు రాకపోతే మళ్ళీదరఖాస్తు చేయండి

-మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 : పట్టణ, గ్రామసభల్లో వెల్లడించేది తుది జాబితా కాదని మాజీ మంత్రి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం అయన మాట్లాడుతు ఈ నెల 26 నుంచి అమలు కాబోతున్న నాలుగు పథకాల జాబితాలో పేర్లు రాలేదని ఎవరూ అందోళన చెందాల్సిన పని లేదని జాబితాలో పేరు ఉంటే ఉన్నట్లు. లేకపోతే రానట్లు కాదని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయా పట్టణం, గ్రామాల్లో జరుగుతున్న సభలను ఉద్దేశించి దామోదర్ రెడ్డి మాట్లాడారు. పేదవాళ్ళల్లో బహు పేదవాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇలా ఏ పధకం అయినా అర్హత ఉన్న వారికే అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జరిగే గ్రామ సభల్లో ప్రకటించే జాబితాలో అర్హత ఉండి పేరు రాకపోతే ఆ గ్రామ సభల్లోనే మళ్ళీ దరఖాస్తు ఫారం పైన దరఖాస్తులు రాసి ఇచ్చినా వాటి ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర అంతా ఇదే పద్ధతి అవలంభించడం జరుగుతుందని తెలిపారు. జాబితాలను ప్రకటించే క్రమంలో కొన్ని పొరపాట్లు దొర్లిన మాటలు వాస్తవమేనని వాటిని సవరించేందుకే మళ్ళీ పట్టణ, గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.ఇది నిరంతర ప్రక్రియ అని విడతల వారీగా ప్రజా ప్రభుత్వంలో ప్రతీ పేదవానికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రతిపక్షం కావాలనే అనవసర రాద్దాంతాలు సృష్టించుతుందని పేర్కొన్నారు. పేదవాడికి మంచి చేసే ప్రభుత్వాన్ని విమర్శించడం తగదన్నారు. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఒక పేదవాడికి కూడా న్యాయం చేయలేకపోయిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేక అవాకులు చవాకులు పేలుస్తుందన్నారు. ఈ పథకాలపై ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్