18.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణపి ఆర్ టి యు నూతన కార్యవర్గం ఏర్పాటు.

పి ఆర్ టి యు నూతన కార్యవర్గం ఏర్పాటు.

పి ఆర్ టి యు నూతన కార్యవర్గం ఏర్పాటు.

ప్రభుత్వ పాఠశాలలా బలోపేతనికి కృషి చేస్తా..

పి ఆర్ టి యు నూతన అద్యక్షులు కెవిఎన్ రెడ్డి.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 

సిద్దిపేట పి ఆర్ టి యు భవన్ లో శనివారం చేర్యాల మండల పి ఆర్ టి యు ఉపాధ్యాయుల ఎన్నికలు జరిగాయి. చేర్యాల మండల అధ్యక్షులుగా కె వెంకట నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఏ శ్రీనివాసరావు లను ఏకగ్రీవంగా  ఎన్నికోవడంతో ఈ ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కూర రఘువత్తం రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీ సమక్షంలో నూతన కార్యవర్గం  ప్రమాణస్వీకారం చేశారు. ఈ సదర్భంగా రఘువత్తం రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వము దృష్టికి తెచ్చి పరిష్కరిస్తానని అన్నారు. నూతనంగా ఎన్నికైన అద్యక్షులు వెంకట నరసింహారెడ్డి ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపి మాట్లడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ఉపాద్యాయుల సంక్షేమం కృషి చేస్తానని బాధ్యతాయుతంగా సంఘ టీచర్ల ఉన్నతికి పెద్దల సూచనలతో ముందుకు వెళ్తానని తోటి ఉపాధ్యాయులు నాపై పెద్ద బాధ్యత పెట్టారని వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఉపాధ్యాయుల సమస్యలు  నెర వెర్చేందుకు కృషి చేస్తానని వెన్నంటి ఉండి సమస్యలు పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నకోడూరు సభ్యులు నాయకులు పిఆర్టియు చేర్యాల నాయకులు ఇతర సంఘ బాధ్యులు మన జిల్లా అధ్యక్షులు మల్లు శశిధర శర్మ ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి జిల్లా బాధ్యులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్