26.7 C
Hyderabad
Thursday, March 13, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్సిద్దిపేటలో చాగంటి ప్రవచనాలు.

సిద్దిపేటలో చాగంటి ప్రవచనాలు.

సిద్దిపేటలో చాగంటి ప్రవచనాలు.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

ప్రాఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు సిద్ధిపేట కు రానున్ననారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1,2 తేదీల్లో మూడు రోజుల పాటు సిద్దిపేట జిల్లా పటణంలోని డిగ్రీ కళాశాల మైదానం లో ఆయన ప్రవచనాలు చెప్పనున్నారు. ఆధ్యాత్మిక రంగం లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. భారత, రామాయణ, భాగవత ఇతిహాసాలు. వేదాల సారాన్ని పురాణేతిహాసాల్ని అనేక కొణాల్లో అధ్యయనం చేసిన చాగంటి వాటి సారాన్ని పండితులకు, పామరులకు అర్థమైయ్యే రీతిలో ప్రసంగాలు చేయటంలో దిట్ట.. మానవ సమాజం లో అడుగంటు తున్న విలువలను తిరిగి ప్రతిష్టించడం కోసం, మానవ సమాజాన్ని మంచి వైపు నడిపింంచడం కోసం ఆయన ప్రవచనాలు ఎంతగానో దోహదం చేస్తాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రలతో పాటు దేశవ్యాప్తంగా ఆయన ప్రవచనాలు నిర్వి రామంగా కొనసాగుతున్నాయి. తన జ్ఞాన సంపదను మానవ సమాజానికి పంచుతున్నారు. ఇలాంటి మహనీయుల సందేశాన్ని ఇప్పించాలనే సంకల్పం తో మంత్రి హరీష్ రావు చాగంటి కోటేశ్వర్ రావు ను సిద్దిపేట కు ఆహ్వానించి “మానవీయ విలువలు ” అనే అంశంగా ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పాలని ఆయనను ప్రత్యేకంగా కోరారు. మంత్రి ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1,2 తేదీల్లో సిద్దిపేట కు రావడానికి అంగీకరించారు. ఈ ఏర్పాట్లను సిద్దిపేట ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు శివ్వ శ్రీనివాస్, రావిచెట్టు హనుమాన్ దేవాలయ అర్చకులు వైద్య కృష్ణమాచార్యులు డిగ్రీ కళాశాల మైదానం వేదికగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 30, అక్టోబర్ 1,2 తేదీల్లో  మూడురోజుల పాటు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు ప్రవచనం ఉంటుందని ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి వేదిక పై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయాని తెలిపారు. సుమారు 10 వేల వరకు ప్రవచనాలు వినడానికి వస్తారాని అంచనా వేస్తున్నామని అందుకనుగుణంగా సీట్లు ఏర్పాట్లు చేస్తున్నామని వచ్చే భక్తుల కోసం మంచినీటి వసతి, అత్యవసరమైతే వైద్య చికిత్స కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపు, ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రవచనాలు వినడానికి వచ్చే వారికి ప్రవచన అనంతరం ప్రసాద వితరణ చేస్తున్నామని మైదానం లో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నామని, మంత్రి ఆదేశం మేరకు సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ కడవేరుగు మంజుల ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది సానిటైజేషణ్ పనులను నిర్వహిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట పోలిస్ కమిషనర్ శ్వేత, అసిస్టెంట్ కమిషనర్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. జిల్లా ప్రజలు పెద్ద సంఖ్య లో హాజరు కావాలని సిద్దిపేట ఉత్సవ సమితి పక్షాన పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశం లో కమిటీ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు జిల్లా శ్రీనివాస్, అనిల్ శ్రీనివాస్, టి. మధుసూదన్, గంప శ్రీనివాస్, కూర శ్రీనివాస్, శరభయ్య, క్యాస కాశినాథ్, పోశెట్టి శ్రీకాంత్, జిల్లా ఉదయ్,చింత శ్రీనివాస్, గంప నవీన్, గందే ఎల్లేశం, కూర శెషి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్