ప్రగతి బాటలో పల్లెలు
చిగురుమామిడి మండలంలో 68.7 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వొడితల
సతీష్…
హుస్నాబాద్ యదార్థవాది
హుస్నాబాద్ నియోజకవర్గ చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లి నుండి ముదిమాణిక్యం గ్రామం వరకు 33.50 లక్షల రూపాయలతో నిర్మించనున్న మట్టి రోడ్ పనులకు శంకుస్థాపన, మండల కేంద్రంలో 12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠదామం, రేకొండ గ్రామంలో 10 లక్షలతో మత్స్య పారిశ్రామిక సహకార సంఘభవనం, 12.60 లక్షల రూపాయలతో నిర్మించిన వైకుంఠదామాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి గ్రామానికి నర్సరీ, వైకుంఠదామం, పల్లెప్రకృతి వనం, సెగ్రీగేషన్ షేడ్, డంపింగ్ యార్డు, క్రీడా ప్రాంగణం వంటి మౌళిక సదుపాయాలు, ఒక ట్రాక్టర్ ట్రాలీ, ట్యాంకర్ వంటి సదుపాయాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆయన అన్నారు..