ప్రజల వద్దకే వైద్యం..

284

ప్రజల వద్దకే వైద్యం..

నియోజకవర్గంలో ప్రజలకు చేరువైన వైద్యం..ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఆర్మూర్: 5 జనవరి

ఆర్మూర్ నియోజకవర్గంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ గురువారం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్మూర్ కు కోటి రూపాయల వ్యయంతో డయాలిసిస్ సెంటర్ ను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లకు నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు వైద్యం చేరువైందన్నారు. ఆర్మూర్ ఆసుపత్రిలో 22వేలకు పైగా ప్రసవాలు, ప్రతి నెల 500 ఉచిత ప్రసవాలు జరగాలని, త్వరలో డాక్టర్ల భర్తీ జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్, వైస్ చైర్మన్ మున్ను, పలువురు కౌన్సిలర్లు, డాక్టర్లు నాగరాజు, అమృత్ రెడ్డి, స్రవంతిలతో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి