29.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణప్రజలు ఎమ్మెల్యే గా చూడాలని కోరుకుంటున్నారు..... కర్ణకంటి మంజులారెడ్డి

ప్రజలు ఎమ్మెల్యే గా చూడాలని కోరుకుంటున్నారు….. కర్ణకంటి మంజులారెడ్డి

ప్రజలు ఎమ్మెల్యే గా చూడాలని కోరుకుంటున్నారు….. కర్ణకంటి మంజులారెడ్డి

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

జెండా అజెండా లతో సంబంధం లేకుండా తనను ఎమ్మెల్యే పదవిలో చూడాలని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులారెడ్డి అన్నారు.. ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఏదో ఒక గుర్తుతో పోటీ చెయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కెఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ను సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు ఆమె మహిళలు యువకులతో కలిసి హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ నెహ్రూ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి బైక్ ర్యాలీగా క్రీడా మైదానానికి చేరుకోని క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అమే మాట్లాడుతూ మంజులక్క యువసేన జెండా హుస్నాబాద్ నియోజకవర్గంలో కచ్చితంగా ఎగురుతుందని నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలుగా సేవ చేస్తూ కష్టపడుతున్న మహిళనైన తనకు నియోజకవర్గ ప్రజలు ఒక్క అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకుల జీవితాలతో ప్రభుత్వం అధికార యంత్రాంగం చెలగాటమాడుతోందని ఇందుకు నిదర్శనం టీఎస్ పి ఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారమేనని దీనికి కారణం లోపభూయిష్టంగా ఉన్న ఈ రాజకీయ వ్యవస్తేనాని తెలిపారు. రాజకీయ మార్పు అనేది మంజులక్క యువసేనతోనే ప్రారంభం అవుతుందని తానను ఎమ్మెల్యేగా గెలిస్తే ఎల్లమ్మ తల్లి సాక్షిగా వచ్చే సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ ను మరింత గ్రాండ్ గా నిర్వహిస్తానని నియోజకవర్గంలో మహిళలు యువకులు తనకు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారని ఇది నాకు దేవుడిచ్చిన వరమని తెలిపారు. ఈ కార్యకమంలో యువతీ యువకులు మహిళలు యువసేన నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్