ప్రమాదపు సంఘటన స్థలలను పరిశీలించిన ఏసిపి వెంకటేశ్వర్లు
యదార్థవాది ప్రతినిది ధర్పల్లి
ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం నిజామాబాద్ ఏసిపి వెంకటేశ్వర్లు ప్రమాదపు సంఘటన స్థలాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ.ఎక్కడైతే ప్రమాదపు సూచనలు ఉన్నాయో అక్కడ గ్రామ ప్రజలను, గ్రామ అభివృద్ధి కమిటీ ,రాజకీయ నాయకులను, రైతులను పిలిచి అవగాహన కల్పించారు. అలాగే ధర్పల్లి సీఐ సైదాకు ఎస్ఐ వంశీకృష్ణారెడ్డికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసిపి వెంకటేశ్వర్లు, సీఐ సైదా, డిచ్ పల్లి సిఐ మోహన్, ధర్పల్లి ఎస్సై వంశీకృష్ణ , బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు హన్మంత్ రెడ్డి,మాజీ సర్పంచ్ కర్క గంగారెడ్డి, విడిసి చైర్మన్ చెలిమల రంజిత్, వీడీసీ సభ్యులు,రైతులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగింది.