గౌరవెల్లి ప్రాజెక్టుతో రైతుల ఆనందం: ఎమ్మెల్యే
-గౌరవెల్లి ప్రాజెక్టులో రెండో ట్రయల్ రన్ ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్…
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో ట్రయల్ రన్ ను లాంఛనంగా ఎమ్మెల్యే సతీష్ ప్రారంభించి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా 62,000 ఎకరాలకు సాగునీరు అందుతుందనిన పది రోజుల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభింపజేసి, లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం లక్ష 6000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, జడ్పీటీసీలు, ఎంపిటిసిలు, స్థానిక ప్రజా ప్రతినిదులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..