
మన ఊరు మన బడిలో వేగం పెంచాలి..
హుస్నాబాద్ నియోజకవర్గం, బెజ్జంకిలో మన ఊరు మన బడి పథకంఫై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్….
సిద్దిపేట 27 డిసంబర్
సిద్దిపేట సమీకృత జిల్లా సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గం, బెజ్జంకి మండలలో మన ఊరు మన బడి పథకనికి కేటాయుంచిన పాఠశాలల హెచ్ ఎం, ఎస్ఎంఎసి చైర్మన్లు, ఎంఈవో, ఎంపిడిఒ, ఎపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఏఈ, డిఈ లు మరియు సర్పంచ్, కౌన్సిలర్లు, నిర్మాణ ఏజెన్సీలతో కలెక్టర్ జీవన్ పాటిల్ సమీక్షించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ….జిల్లా మొత్తంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో పనులు నత్తనడకన సాగుతున్నాయి, బెజ్జంకి మండలలో ఇంకా మెరుగుపర్చుకోవాలని తెలిపారు. ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, మేజర్ మైనర్ (కిటికీలు, డోర్లు, స్లాప్, ఫ్లోర్) రిపేర్లు తప్పని సరిగా వేగంగా పూర్తి చేసిలని, ఎన్ఆర్ఈజిఎస్, ఈజీఎస్ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్ షేడ్ పూర్తి చేశాకే మిగతా ప్రహరీ గోడ, అదనపు తరగతి గదులు పూర్తి చెయ్యాలని, ఎంపిడిఓ, ఎంపిఓ లు రోజు పాఠశాలల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షణ చేపించాలని. పాత భవనాలను కూల్చి వేయడానికి గ్రామ పంచాయతీ, పల్లె ప్రగతి నిధుల నుండి చేయాలని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీలు పనులు పూర్తి అయిన తర్వాత పాఠశాల లోపల కాని బయట మైదానంలో కాని ఎలాంటి చెత్త, చెదారం, పాత సామాను, రాళ్ళు, రప్పలు లాంటివి ఎలాంటివి ఉండకూండ శుభ్రంగా ఉంచాలని సూచించారు. భవనం అన్ని సదుపాయాలు కల్పించి రంగులు వేస్తే సరిపోదు పాఠశాలల్లో మైదానంలో గడ్డి కార్పెట్ పెంచి సుందరంగా తీర్చిదిద్దాలి.ఎంపిడిఒ ఎంపిఓ లు ఏఈ లకు తోడ్పాటునందించాలి. పనులు పూర్తి అయ్యేవరకు సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటాం కావున మళ్లీ సమావేశం లోపు పనుల్లో వేగం పెంచి పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో డీఆర్డీఏ పిడి గోపాల్ రావు, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
