ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణి
యదార్థవాది ప్రతినిది నిజామాబాద్
భీంగల్ మండలంలోని గ్రామాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను భీంగల్ ఎంపీపీ మహేష్ జడ్పిటిసి చౌటుపల్లి రవి సోమవారం చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మండలంలోని పురానిపేట్ ముచ్కూర్ గ్రామాలకు ఇప్పించారని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య ఏఎంసి చైర్మన్ గుణవీర్ రెడ్డి రైతుబంధు మండల అధ్యక్షులు శర్మ నాయక్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.