33.2 C
Hyderabad
Thursday, March 13, 2025
హోమ్తెలంగాణరైతును రాజుగా చేయడమే కేసీఆర్ లక్ష్యం

రైతును రాజుగా చేయడమే కేసీఆర్ లక్ష్యం

రైతును రాజుగా చేయడమే కేసీఆర్ లక్ష్యం

యదార్థవాది బ్యూరో

బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ అవరణలో రైతుబంధు సమితి కాలమనినీ మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రైతులని రాజుగా చేసే వినూత్న ప్రక్రియ తమ భుజాలపై ఎత్తుకొని రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకం, రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు రైతుభీమా పధకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతు భుజంపై చేయివేసి వెన్నుతడుతున్నది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. దేశంలోనే రైతుల కోసం రాష్ర్ట ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందనీ, రైతులు సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా రైతువేదికలు నిర్మించారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణే అని, ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నర్సింలు,సర్పంచ్ రేవతీ శ్రీనివాస్,ఎంపిటిసి లక్ష్మారెడ్డి, ఆర్ఐ అజయ్,ఉపసర్పంచ్ బాపురెడ్డి,పంచాయతీ కార్యదర్శి నవీన్, ఏఈఓ సాగర్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాజిరెడ్డి, వార్డ్ సభ్యులు రాజమల్లయ్య, రాజిరెడ్డి, రైబస సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు గంగారాం,రవి, శ్రీధర్ రెడ్డి, దేవరాజ్,లింగరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్