34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణరోడ్డు ప్రమాదంలో కానిస్టేబుళ్ల మృతి కలిచి వేసింది

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుళ్ల మృతి కలిచి వేసింది

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుళ్ల మృతి కలిచి వేసింది

-రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజులు

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10: ఇటీవల రోడ్డు ప్రమాదం లో  కానిస్టేబుళ్ల మృతి పట్ల సిద్దిపేట జిల్లా  రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా రిటైర్డ్ పోలీస్ అసోసియేషన్ వద్ద కానిస్టేబుళ్ల మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలీస్ రాజులు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా లో రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి నవీన్, వెంకట్  పరందాములు  మరణించడం బాధాకరమన్నారు. పోలీస్ ఉద్యోగం పట్ల ప్రేమతో కానిస్టేబుళ్లుగా విధులను నిర్వర్తించడం లో పోలీస్ డిపార్ట్ మెంట్ విలువలకు కట్టుబడి పని చేసారని అన్నారు. వారికి ఎంతో సర్వీస్ ఉంది. కానీ విధి వారిని రోడ్డు ప్రమాదంలో కాటేసిందని అవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ సంఘం నాయకులు వీరారెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటాద్రి, మల్లయ్య, చంద్రయ్య, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్