రోడ్డు రవాణ సంస్థలో మెరుగైన సేవలు
యదార్థవాది ప్రతినిది ఆర్మూర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ వారు ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని అని డిపోలలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్మూర్ బస్ స్టాండ్ లో డిపో మేనేజర్ కె. కవిత వాటర్ కూలర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ప్రైవేటు వాహనాలకు దూరంగా ఉండాలని సురక్షితమైన సుఖప్రదమైన ఆర్టీసీ బస్సు లోని ప్రయాణించాలని ప్రయాణికులను కోరారు. కార్యక్రమంలో ఎం ఎఫ్ గంగా కిషన్ ఎస్ టి ఐ పారు పిడబ్ల్యుసి మెంబర్ నాగేశ్వరరావు సేఫ్టీ వార్డెన్ ఎన్ వి వి రెడ్డి డివిఎస్ చక్రవర్తి ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.